www.ntodaynews.com
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీ స్పందన
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీ స్పందన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం 9.20 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
పథకం కింద సొంత స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. స్థలం లేని అర్హులకు 3 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎంఏవై–ఎన్టీఆర్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.