BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణానికి అవకాశం కల్పించాలి: సీపీఎం మండల కమిటీ వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:57 AM
15 వీక్షణలు


విస్సన్నపేట: గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన సెంటున్నర ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం విస్సన్నపేట మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మండల తహసీల్దార్ కె. లక్ష్మీకళ్యాణికి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు 300 మందికి పైగా సెంటున్నర ఇళ్ల స్థలాలు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను తొలగిస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు కాలనీ ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించడంతో పాటు, అక్కడ రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధి కోసం ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాగరాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జానరత్నం, మండల కమిటీ సభ్యులు వినుకొండ రంగారాణి, ఆడిమెల్లి కిషోర్, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.