BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణానికి అవకాశం కల్పించాలి: సీపీఎం మండల కమిటీ వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:57 AM
78 వీక్షణలు


విస్సన్నపేట: గత ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన సెంటున్నర ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం విస్సన్నపేట మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మండల తహసీల్దార్ కె. లక్ష్మీకళ్యాణికి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు 300 మందికి పైగా సెంటున్నర ఇళ్ల స్థలాలు కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను తొలగిస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, గతంలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు కాలనీ ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించడంతో పాటు, అక్కడ రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధి కోసం ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని నాగరాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జానరత్నం, మండల కమిటీ సభ్యులు వినుకొండ రంగారాణి, ఆడిమెల్లి కిషోర్, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.