BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తిరువూరు డివిజన్‌లో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీవో ఏ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:57 AM
66 వీక్షణలు

తిరువూరు, జూన్ 29: తిరువూరు డివిజన్‌లో యూరియా ఎరువుల పంపిణీ పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఆర్డీవో ఏ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ, తహసీల్దార్లు, ఎంఏవోలు, తిరువూరు డివిజన్ పరిధిలోని పీఏసీఎస్ ప్రతినిధులు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.

యూరియా పంపిణీ పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని, అర్హులైన రైతులకు అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, నిల్వ ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎంఆర్ఓలు, ఎంఏవోలు తమ పరిధిలో యూరియా పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.