www.ntodaynews.com
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్
తెలంగాణ
అశ్వారావుపేట, జూన్ 30: అశ్వారావుపేట ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. దొంతికుంట చెరువు నుంచి నల్లమట్టి తరలించుకునేందుకు అనుమతి మంజూరు చేయడానికి ఓ రైతు నుంచి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించి, రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ శ్రీనివాస్ను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.