www.ntodaynews.com
గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు విప్లవ్ కుమార్ మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న డి. విప్లవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందారు.
వారి అకాల మరణం పట్ల ఎస్టీయూ చాట్రాయి మండల శాఖ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విప్లవ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు.
ఎస్టీయూ చాట్రాయి మండల శాఖ అధ్యక్షుడు అమరయ్య, ప్రధాన కార్యదర్శి నరసింహరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాబు, ఏలూరు జిల్లా ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి జి. రాము, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పుల్లారావు తదితర సంఘ సభ్యులు తమ సంతాపాన్ని తెలిపారు.