www.ntodaynews.com
గుంటూరు: దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులకు శనివారం ప్రత్యేక గ్రీవెన్స్
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు, ఆగస్టు 27: దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు.
ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక గ్రీవెన్స్ ఉదయం 10 గంటల నుంచి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్కు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగులకు సూచించారు.