గుంటూరులో వార్డు అడ్మిన్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 112వ సచివాలయానికి చెందిన వార్డు అడ్మిన్ సెక్రటరీ కె. హిల్డను అధికారులు సస్పెండ్ చేశారు.
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అదనపు కమిషనర్ G. Sambasiva Rao తెలిపిన వివరాల ప్రకారం, కె. హిల్డకు బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆమె సంబంధిత ఆదేశాలను స్వీకరించలేదు. అలాగే భారత ఎన్నికల సంఘం (ECI) బీఎల్వో లాగిన్లో నమోదు చేసుకోకపోవడంతో ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, విధులకు గైర్హాజరయ్యే లేదా నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అదనపు కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.