BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

గుట్కా ఉమ్మబోయి ప్రాణం కోల్పోయిన ప్రయాణికుడు.. కిటికీలోంచి తల బయటపెట్టడం ఘోరాంతం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 07:39 PM
36 వీక్షణలు

 ఓ చిన్న నిర్లక్ష్యం, కేవలం ఐదు రూపాయల గుట్కా కోసం చేసిన పొరపాటు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

జాతీయ రహదారిపై నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (ఎన్‌డబ్ల్యూకేఆర్టీసీ) బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు గుట్కా నములుతూ కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత నోటిలోని గుట్కాను ఉమ్మివేయాలనే ఉద్దేశంతో బస్సు కిటికీలోంచి తలను బయటకు పెట్టాడు.

అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న మరో వాహనం బస్సుకు అతి సమీపంగా దూసుకెళ్లడంతో ఆ ప్రయాణికుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కొంతదూరం వరకు రోడ్డంతా రక్తంతో తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనను గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒక కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్న వ్యక్తి, కేవలం ఒక చెడు వ్యసనం కారణంగా గమ్యానికి చేరకముందే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో "ఐదు రూపాయల గుట్కా ప్రాణం తీసింది" అనే శీర్షికతో విస్తృతంగా వైరల్ అవుతోంది.

ఈ ఘటన మరోసారి ప్రయాణ సమయంలో కిటికీల్లోంచి తలలు, చేతులు బయటకు పెట్టడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసింది.