గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన…
గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన… గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ
హైదరాబాద్, మార్చి 24: గ్యాస్ కొరత సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం భారీ నిరసన చేపట్టారు.
నగరంలోని గన్ పార్క్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ర్యాలీ అసెంబ్లీ వైపు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరాలో విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.