దద్దాలవారిపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దద్దాలవారిపల్లిలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
రొంపిచర్ల | N Today News
రొంపిచర్ల మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు.
ఇందులో భాగంగా రొంపిచర్ల మండలం బోడిపాటివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దద్దాలవారిపల్లిలోని పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. చిన్నారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.