BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
28 May, 2026 - 01:34 PM
27 వీక్షణలు

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ ఆదేశాల మేరకు పలనాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్‌లో టిడిపి ప్రతిష్టాత్మక కార్యక్రమం “మహానాడు పసుపు జాతర–2026”ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్‌, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా, డాక్టర్ కోడెల శివరాం తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమ ప్రారంభంలో నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేడుకలను ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరత, ఆర్థిక ఒత్తిడి పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈసారి మహానాడును తొలిసారిగా వర్చువల్ విధానంలో నిర్వహించడం విశేషమైంది.

ఈ సందర్భంగా టౌన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుండి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తదితర అగ్రనాయకులు అందించిన సందేశాలను ఆసక్తిగా వీక్షించారు.

అనంతరం పార్టీ ప్రవేశపెట్టిన పలు కీలక తీర్మానాలను సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా అభినందిస్తూ తమ మద్దతు ప్రకటించారు. మహానాడు కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.