www.ntodaynews.com
పాఠశాల కళా వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
తెలంగాణ
పాఠశాల కళా వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా,
గ్రామంలో బడి బాగుంటేనే ఊరు బాగుంటుంది అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం, వీరారెడ్డిపల్లి గ్రామంలో మన్నే ఫౌండేషన్ చైర్మన్ మన్నె మహేష్, యండపల్లి రాంరెడ్డి సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశానికి ఉపయోగపడే మేధావులను తయారు చేసేది పాఠశాలలేనని ఆయన అన్నారు, ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విద్యార్థుల కోసం కళావేదికను నిర్మించి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, మండల అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube