www.ntodaynews.com
ప్రభుత్వ ద్వంద విధానాలు మానుకోవాలి
తెలంగాణ
ప్రభుత్వ ద్వంద విధానాలు మానుకోవాలి,బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడే పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలి-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం
NTODAY NEWS:బొమ్మలరామారం
తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి దేశ రాజధాని న్యూఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తాలో నిర్వహిస్తున్న ఒక్కరోజు దీక్షను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి భగ్నం చేయడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు సోమవారం రోజున బొమ్మలరామారం సిపిఎం మండల కేంద్రంలో ఆయన పార్టీ నాయకులతో కలసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ల కోసం మద్దతుగా భువనగిరి సిపిఎం పార్టీ భువనగిరి చౌరస్తాలో పోరాడుతున్న తరుణంలో భువనగిరి ఏసిపి రాహుల్ రెడ్డికి లిఖితపూర్వకంగా ముందస్తుగా తెలియజేసినప్పటికీ అత్యత్సహంతో పోలీసులు దీక్ష శిబిరం టెంట్ ను తొలగించి భగ్నం చేయడాన్ని తప్పు పట్టారు ప్రభుత్వం బిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పార్టీలను కలుపుకొని పోవాలని సూచించారు లేకుంటే బీసీల వ్యతిరేకత మూటగట్టుకుంటారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముద్దం మధుసూదన్ రెడ్డి, బండ కొమురయ్య, దేవేందర్, దేశెట్టి సత్యనారాయణ, నల్లగొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube