BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:28 PM
106 వీక్షణలు

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటవద్దని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో, ఆ హెచ్చరికను అమలు చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

భారీ ఆయిల్ ట్యాంకర్ అనుమతి తీసుకోకుండా జలసంధి మార్గంలో ప్రయాణిస్తుండగా, దానిపై దాడి చేసి పేల్చివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఘటనకు సంబంధించిన నౌక మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రపంచ ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని వినియోగించుకునేందుకు భారత్, పాకిస్తాన్ సహా ఆరు దేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పేల్చివేసిన నౌక పాకిస్తాన్‌కు చెందినదే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.