హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య
హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటవద్దని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో, ఆ హెచ్చరికను అమలు చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
భారీ ఆయిల్ ట్యాంకర్ అనుమతి తీసుకోకుండా జలసంధి మార్గంలో ప్రయాణిస్తుండగా, దానిపై దాడి చేసి పేల్చివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఘటనకు సంబంధించిన నౌక మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రపంచ ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని వినియోగించుకునేందుకు భారత్, పాకిస్తాన్ సహా ఆరు దేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పేల్చివేసిన నౌక పాకిస్తాన్కు చెందినదే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.