BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:28 PM
94 వీక్షణలు

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటవద్దని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో, ఆ హెచ్చరికను అమలు చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

భారీ ఆయిల్ ట్యాంకర్ అనుమతి తీసుకోకుండా జలసంధి మార్గంలో ప్రయాణిస్తుండగా, దానిపై దాడి చేసి పేల్చివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఘటనకు సంబంధించిన నౌక మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రపంచ ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని వినియోగించుకునేందుకు భారత్, పాకిస్తాన్ సహా ఆరు దేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పేల్చివేసిన నౌక పాకిస్తాన్‌కు చెందినదే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.