BREAKING
నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి
www.ntodaynews.com

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 10:28 PM
162 వీక్షణలు

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తన అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి దాటవద్దని ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో, ఆ హెచ్చరికను అమలు చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

భారీ ఆయిల్ ట్యాంకర్ అనుమతి తీసుకోకుండా జలసంధి మార్గంలో ప్రయాణిస్తుండగా, దానిపై దాడి చేసి పేల్చివేసినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఘటనకు సంబంధించిన నౌక మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రపంచ ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని వినియోగించుకునేందుకు భారత్, పాకిస్తాన్ సహా ఆరు దేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పేల్చివేసిన నౌక పాకిస్తాన్‌కు చెందినదే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఘటనతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతుండగా, చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.