www.ntodaynews.com
హైదరాబాద్: ఖమ్మం–వరంగల్–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాస్ ఖరారు
తెలంగాణ
హైదరాబాద్: ఖమ్మం–వరంగల్–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాస్ ఖరారు
ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా గడల శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
పట్టభద్రుల సమస్యలపై పోరాటం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యా రంగ అభివృద్ధి వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులను కలుపుకుని విస్తృత ప్రచారం నిర్వహించేందుకు జనసేన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది.