BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

హైదరాబాద్‌: మీరాలం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం.....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:22 PM
26 వీక్షణలు

హైదరాబాద్‌: మీరాలం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశాలు

మీరాలం చెరువు పై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని ఆదేశించారు.

మీరాలం చెరువును ఆధునిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. చెరువులో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు అనువైన విధంగా డిజైన్‌ చేయాలని, చెరువులోని ఐలాండ్‌లను సుందరీకరించి అభివృద్ధి చేయాలని సూచించారు.

విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మీరాలం చెరువుకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రకృతి అందాలు, వినోద సదుపాయాలు కలిపి సందర్శకులకు ఆకట్టుకునే అనుభూతిని అందించేలా అభివృద్ధి చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.