BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

హైదరాబాద్: మంత్రి పదవి రేసులో రాములమ్మ..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 10:36 AM
38 వీక్షణలు

హైదరాబాద్: మంత్రి పదవి రేసులో రాములమ్మ.. విజయశాంతి పేరుపై కాంగ్రెస్‌లో చర్చ!

కొండా సురేఖపై నిర్ణయం తర్వాతే స్పష్టత.. బీసీ మహిళా కోటాలో అవకాశం దక్కేనా?

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో మంత్రి పదవుల భర్తీపై కొత్త చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం పార్టీ అధిష్టానం పరిశీలనకు చేరిన నేపథ్యంలో, ఒకవేళ మార్పులు చోటుచేసుకుంటే ఖాళీ అయ్యే స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై కాంగ్రెస్‌ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళా ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పార్టీకి అందించిన సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో సీనియర్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి పేరు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీసీ మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా విజయశాంతికి అవకాశం కల్పించే అంశాన్ని పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో మంత్రి పదవిపై తనకు హామీ లభించిందని విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నట్లు సమాచారం.

ఢిల్లీ స్థాయిలోనూ విజయశాంతి పేరుపై చర్చ జరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో, కొండా సురేఖ స్థానంలో రాములమ్మకు అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొంది.

అయితే కొండా సురేఖపై పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం అనంతరమే మంత్రి పదవి భర్తీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశావహుల జాబితాలో విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.