BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

హైదరాబాద్‌లో భారీ కల్తీ మసాలా దందా బట్టబయలు 25.3 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 05:41 PM
46 వీక్షణలు

హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలా తయారీ, విక్రయాలపై అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. హెచ్-ఫాస్ట్ అధికారులు నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు.

తనిఖీల్లో మసాలా పొడుల్లో సింథటిక్ రంగులు, వస్త్రాలకు ఉపయోగించే రంగులు, టాల్కమ్ పౌడర్, పారిశ్రామిక రంగులు, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ఆరోగ్యానికి హానికర పదార్థాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు.

ఇలాంటి కల్తీ మసాలాల వినియోగం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన, ప్రమాణిత ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.