హైదరాబాద్లో భారీ కల్తీ మసాలా దందా బట్టబయలు 25.3 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలా తయారీ, విక్రయాలపై అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. హెచ్-ఫాస్ట్ అధికారులు నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు.
తనిఖీల్లో మసాలా పొడుల్లో సింథటిక్ రంగులు, వస్త్రాలకు ఉపయోగించే రంగులు, టాల్కమ్ పౌడర్, పారిశ్రామిక రంగులు, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ఆరోగ్యానికి హానికర పదార్థాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు.
ఇలాంటి కల్తీ మసాలాల వినియోగం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన, ప్రమాణిత ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.