BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

హనుమాన్ జంక్షన్‌లో దారుణ హత్య కలకలం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:19 PM
51 వీక్షణలు

హనుమాన్ జంక్షన్‌లో దారుణ హత్య కలకలం

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీ కొట్టి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హనుమాన్ జంక్షన్‌కు చెందిన హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రామినేని రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా కారుతో వెంబడించి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రాంతి కిరణ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ఢీకొట్టుడుతో తీవ్రంగా గాయపడిన క్రాంతి కిరణ్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.