హనుమాన్ జంక్షన్లో దారుణ హత్య కలకలం
హనుమాన్ జంక్షన్లో దారుణ హత్య కలకలం
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీ కొట్టి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హనుమాన్ జంక్షన్కు చెందిన హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రామినేని రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా కారుతో వెంబడించి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రాంతి కిరణ్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ఢీకొట్టుడుతో తీవ్రంగా గాయపడిన క్రాంతి కిరణ్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.