ప్రమాద బీమా చెక్కు అందజేత
మంచిర్యాల: మంచిర్యాల గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖ ఖాతాదారుడి కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేశారు.
గాయత్రి బ్యాంకు ఖాతాదారు సిరిపురం మల్లేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయనకు బ్యాంకులోని గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ఉన్న ప్రమాద బీమా సౌకర్యం ద్వారా రూ.1 లక్ష బీమా మొత్తం మంజూరైంది.
ఈ మేరకు మృతుడి భార్య మల్లెల స్రవంతికి సంబంధించిన రూ.1,00,000 ప్రమాద బీమా చెక్కును మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంకు మంచిర్యాల శాఖ బ్రాంచ్ మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్లు ఇ. శివకుమార్, డి. రాజశేఖర్, ఆర్. రమేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కో-ఆప్షన్ సభ్యుడు మీనాస్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.