BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 November 2025, 09:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చేతిరాతను బట్టి మనోభావాలను అర్థం చేసుకోవచ్చు

తెలంగాణ
23 Nov, 2025 - 09:13 AM
356 వీక్షణలు
చేతిరాతను బట్టి మనోభావాలను అర్థం చేసుకోవచ్చు :-HCF చర్చాగోష్టిలో ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య NTODAY NEWS: హైదరాబాద్ మన మనస్తత్వాన్ని, మన చేతిరాతను బట్టి చెప్పవచ్చని CESS రిటైర్డ్ ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో జరిగిన చర్చాగోష్టిలో ప్రొఫెసర్ రామచంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై గ్రాఫాలజీ మరియు గ్రాఫోతెరపి అంశాన్ని పరిచయం చేస్తూ మాట్లాడారు. చేతిరాతకు సైకాలజీకి సంబంధం ఉందని, చేతిరాతను బట్టి మన మనోభావాలను, మానసిక స్థితిని తెలుసుకోవచ్చని తద్వారా చేతిరాతలో మార్పులు చేసుకొనుట ద్వారా కొన్ని మానసిక విషయాలను అధిగమించవచ్చునని, ఇది ఒక శాస్త్రం అని అన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, విద్యార్థులకు పూర్తిస్థాయి డిజిటలైజేషన్ చేయటం ద్వారా చేతిరాతకు పని లేకుండా పోతున్నదని అన్నారు. స్వీడన్ లో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయి డిజిటలైజేషన్ చేశారని ఫలితంగా అనేక దుష్పరిణామాలు ఏర్పడి సమీక్షించుకొని తిరిగి పాక్షికంగా అంత మేరకు పాత పద్ధతికి దాల్చిన స్థితి వచ్చిందని అన్నారు. చర్చాగోష్టికి హాజరైన విద్యార్థులు, యువతులు సీనియర్ సిటిజెన్ల చేతి రాతలను పరిశీలించి వారి అలవాట్లను భావాలను తెలియజేశారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న వారంతా ప్రొఫెసర్ రామచంద్రయ్య విశ్లేషణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్చాగోష్టికి ప్రముఖ మిమిక్రీ కళాకారులు కళారత్న రమేష్ గారు అధ్యక్షత వహించారు. పర్యావరణ వేత్త డాక్టర్ జయసూర్య, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం శ్రీనివాస్, సామాజికవేత్త రాజీవ్ కుమార్, రిటైర్డ్ ఎస్సీ ఇంజనీర్ భవాని శంకర్, హెచ్ సి ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.వీరయ్య, నాయకులు పి శ్రీనివాసరావు, సుకుమార్, సంగీత,లలిత, శంకర్, రఘు, మోహన్ నాయుడు ఇతరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube