హయత్నగర్లో టైగర్స్ కుంగ్-ఫు బెల్ట్ ప్రదానోత్సవం
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని బచ్పాన్ స్కూల్ గ్రౌండ్లో టైగర్స్ కుంగ్-ఫు & కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. అకాడమీ జిల్లా ఆర్గనైజర్ మునుకుంట్ల శివ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ పరీక్షల్లో దాదాపు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హయత్నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి, స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేటి సమాజంలో పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు బ్లాక్ బెల్ట్ నిర్వాహకులు క్రాంతి, కార్తికేయ, జేతిన్ తదితరులు