www.ntodaynews.com
హైదరాబాద్ సౌత్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో మహాసభ
తెలంగాణ
హైదరాబాద్ సౌత్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో మహాసభ
NTODAY NEWS: సైదాబాద్ రిపోర్టర్ పగడాల దేవయ్య...
ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యల మీద పోరాటం చేసేది సిఐటియు ఒక్కటి
హైదరాబాద్ సౌత్ జిల్లా తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభ ఆలం కుందుమెరి భవన్ సంతోష్ నగర్ లో జరిగింది. ఈ మహాసభ కి ముఖ్యఅతిథిగా తెలంగాణ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్మికులు ఉన్నారని వాళ్లకు సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ ద్వారా నిర్ణయాలు చేయాలని అన్నారు .ముఖ్యంగా పాతబస్తీ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండే కార్మికులు చదువు రాని కారణంగా ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవడంలో లోపాలు ఉన్నాయి వాటిని చైతన్యవంతం చేయడం ద్వారా ట్రాన్స్పోర్ట్ రంగం నుండి కృషి చేయడం మాత్రమే ఇక్కడ మార్పుకు సహాయపడుతుంది తప్ప వేరే ఏమీ ఉపయోగపడదని అన్నారు .ఆటో డ్రైవర్లకు లైసెన్సులు లేకపోవడం కారణంగా ఆటో డ్రైవర్ల అందరికీ లైసెన్సులు ఇప్పించడంలో సిఐటియు గతం నుండి కూడా ముందుంటుందని ఇప్పుడు కూడా రాబోయే రోజులలో లైసెన్సులు చదువు మూలంగా లైసెన్సులు పొందలేని వారి కోసం వాళ్ళ పక్షాన నిలబడాలని అన్నారు. తదనంతరం హైదరాబాద్ సౌత్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా వి రామకుమార్ .ప్రెసిడెంట్గా ఎండి బాబర్ఖాన్.. సెక్రటరీ ఎల్ కోటయ్య... ట్రెజరర్ సత్యనారాయణ.. కమిటీ సభ్యులుగా యాకూబ్ ..బాబా..ఎం.క్రిష్ణ.. సంతోష్ .రమేష్ .ఫయాజ్ .జావేద్. వెంకటేష్ .ఎం వెంకటేష్ . యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube