ఇడుపులపాయలో తుమ్మగూడెం యువకులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామానికి చెందిన యువకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ఉన్న అభిమానంతో ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ను సందర్శించి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్తో తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఇడుపులపాయకు వెళ్లిన వారిలో బొల్లికొండ రాము, బొల్లికొండ ఆంజనేయులు, పానుగంటి శేఖర్, పానుగంటి వీరబాబు, ఇలవల వెంకట్ ఉన్నారు.