తుమ్మగూడెంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు మాదల వెంకట నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మాదల వెంకట నరసింహారావు మాట్లాడుతూ సంక్షేమం అంటేనే వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. అలాంటి మహానేత మన మధ్య భౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు.
వైఎస్సార్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.