వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ
చౌడేపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
చౌడేపల్లి | Ntoday News
దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చౌడేపల్లి మండలంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పేద ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ “జోహార్ వైఎస్సార్.. జోహార్ రాజన్న” అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండల వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.