TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభం
TVS ఈ-వెహికల్ షోరూమ్ ప్రారంభం
నూతన షోరూమ్ను ప్రారంభించిన కొక్కిరాల సురేఖ
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన TVS E-Vehicle Pvt. Ltd. షోరూమ్ను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
ఈ సందర్భంగా షోరూమ్ యాజమాన్యానికి ఆమె హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభమైన షోరూమ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సురేఖను షోరూమ్ యాజమాన్యం శాలువాతో సన్మానించింది.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్చార్జి నూకల రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.