ఓటర్ల సవరణకు ప్రత్యేక క్యాంపులు
తెలంగాణ
సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహణ
తెలంగాణ | Ntoday News
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల సవరణ, అభ్యంతరాల దాఖలుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులు దాదాపు 92 లక్షల నోటీసులను సిద్ధం చేయగా, ఇప్పటివరకు 31 లక్షల మందికి నోటీసులు అందజేశారు.
ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవడంతో పాటు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 16 వరకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఓటర్ల వివరాల్లో తప్పుల దిద్దుబాటు, కొత్త ఓట్ల నమోదు తదితర ప్రక్రియలను సులభతరం చేసేందుకు సెప్టెంబరు 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.