ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా.
ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ధర్నాలో ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు ఆరు పెండింగ్లో ఉన్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉద్యోగుల బకాయిలు రూ.4 వేల కోట్లు ఉండేవి, ఇప్పుడు రూ.16 వేల కోట్లకు చేరాయి
ఉద్యోగుల నుంచి నాలుగు నెలలుగా జీతాల్లో కోతలు విధిస్తూ, ఆరోగ్య పథకాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గం
టీచర్లపై చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తారు, అలాంటిది 10% కమీషన్ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భార్యపై వచ్చిన ఆరోపణలపై చర్యలు ఎందుకు లేవో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం తప్ప, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు
రేవంత్ రెడ్డి మళ్లీ గెలవాలంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
– ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి