BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే బైక్ సీజ్..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
22 Aug, 2026 - 09:11 PM
27 వీక్షణలు
ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే బైక్ సీజ్..

నందిపేట: ద్విచక్ర వాహనదారులు ఇకపై రోడ్డెక్కితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని నందిపేట ఎస్సై వినయ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నందిపేట, డొంకేశ్వర్ మండలాల పరిధిలో ఆగస్టు 22 నుండి ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, కేవలం వాహనం నడిపేవారే కాకుండా వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ, కోమాలోకి వెళ్తూ వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఎస్సై, వాహనదారులంతా పోలీసుల జరిమానాలకు భయపడి కాకుండా, తమ ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల సంతోషాల కోసం బాధ్యతగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.