ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్పై చంద్రబాబు ప్రచారం!
ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్పై చంద్రబాబు ప్రచారం!
అమరావతి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఇంటింటి ప్రచార యజ్ఞం చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాను కూడా స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించారు.
అంతేకాకుండా, ఈ-సైకిళ్లపై ప్రచారం నిర్వహించాలని సూచించిన సీఎం, "నేను కూడా సైకిల్ ఎక్కి ప్రజల మధ్యకు వస్తా" అని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు సంకేతాలు ఇచ్చారు.