BREAKING
కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు! కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి త్రికోటేశ్వర స్వామి దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కొండపర్వ లో సహజ వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ దూపిశెట్టి వారి నూతన వస్త్ర వేడుకలు జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం నేడు ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. నూజివీడులో బుధవారం మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన.. ఆదానికి ఎఫ్‌సీఐ సైలో కాంట్రాక్టులు.. దేశ ఆహార భద్రతకు ముప్పు కొండపర్వ వద్ద ప్రమాద ఘంటికలు.. రోడ్డుపై కుప్పకూలిన భారీ వృక్షం కొమ్మలు!
www.ntodaynews.com

ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 06:13 PM
17 వీక్షణలు

ఇంటింటికీ కూటమి జెండా.. ఈ-సైకిల్‌పై చంద్రబాబు ప్రచారం!

అమరావతి: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఇంటింటి ప్రచార యజ్ఞం చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాను కూడా స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించారు.

అంతేకాకుండా, ఈ-సైకిళ్లపై ప్రచారం నిర్వహించాలని సూచించిన సీఎం, "నేను కూడా సైకిల్ ఎక్కి ప్రజల మధ్యకు వస్తా" అని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు సంకేతాలు ఇచ్చారు.