ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య!
రూ. 3 కోట్ల పాలసీ కోసం ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం.. నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, తన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోరానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శరవేగంగా దర్యాప్తు చేపట్టగా, ప్రధాన నిందితురాలైన భార్య భారతి, ఆమె ప్రియుడు సురేందర్లతో పాటు హంతకులు రామ్, మల్లేష్లను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు రామ్కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీసీపీ తెలిపారు