BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

తెలంగాణ
12 Jun, 2025 - 08:16 AM
111 వీక్షణలు
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి-- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్12 బొమ్మలరామారం మండలంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి గురువారం రోజున వినతి పత్రం ఇచ్చిన బొమ్మలరామారం మండల సిపిఎం కార్యదర్శి ర్యకల శ్రీశైలం ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ మండలంలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు మండలంలోని అర్హులైన పేదలందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, ఇందిరమ్మ కమిటీల పేరుతో రాజకీయ జోక్యాన్ని నివారించి అధికారులే అర్హులైన పేదలందరికీ ఇండ్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ చూడడం అనేది నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం కాకుండా పోతుంది,అధికారులు అట్టి రాజీవ్ వికాస పథకంలో అర్హులైన నిరుద్యోగులకు 6000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాన్ని అందిస్తామని చెప్తూనే, ఆ పథకంలో సిబిల్ స్కోర్ చూడడం ద్వారా లబ్ధిదారులను సగానికి పైగా తిరస్కరణకు గురి చేసేటట్లుగా ప్రభుత్వ నిబంధనలు తీసుకుని వస్తుంది అని అన్నారు నిబంధనలను తొలగించి లబ్ధిదారులను అన్ని కార్పొరేషన్ల ద్వారా గుర్తించి పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ముక్యర్ల పున్నమ్మ, ప్యారారం వెంకటేష్ ,దేశెట్టి సత్యనారాయణ, స్వామి, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube