BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 March 2026, 01:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
08 Mar, 2026 - 01:38 AM
245 వీక్షణలు
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తూ అభివృద్ధి సాధిస్తున్న మహిళలను పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తల్లిగా జన్మనిచ్చి, చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా జీవితాన్ని అంకితం చేసి, బిడ్డగా అనురాగాన్ని పంచుతూ కుటుంబానికి వెలుగులు నింపుతున్న మహిళల పాత్ర అపారమని పేర్కొన్నారు. మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళా శక్తి మహత్తు ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. సృష్టికి మూలం స్త్రీలేననే విషయాన్ని సమాజం ఎప్పటికీ మర్చిపోకూడదని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాళ్ల బండి రాజన్న (గౌరవ అధ్యక్షుడు), గజేల్లి వెంకటయ్య (అధ్యక్షుడు), పూజారి నరసయ్య (ప్రధాన కార్యదర్శి), బూర్ల జ్ఞాని (ఉపాధ్యక్షుడు), పి. రామ్ రెడ్డి (కార్యదర్శి), అడిచర్ల రాజేశం, A. గంగయ్య, సిహెచ్ రామస్వామి, G. లక్ష్మణ్, పర్వతాలు యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. #InternationalWomensDay #Mancherial #WomenEmpowerment #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube