BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
08 Mar, 2026 - 01:38 AM
154 వీక్షణలు
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తూ అభివృద్ధి సాధిస్తున్న మహిళలను పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తల్లిగా జన్మనిచ్చి, చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా జీవితాన్ని అంకితం చేసి, బిడ్డగా అనురాగాన్ని పంచుతూ కుటుంబానికి వెలుగులు నింపుతున్న మహిళల పాత్ర అపారమని పేర్కొన్నారు. మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళా శక్తి మహత్తు ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. సృష్టికి మూలం స్త్రీలేననే విషయాన్ని సమాజం ఎప్పటికీ మర్చిపోకూడదని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాళ్ల బండి రాజన్న (గౌరవ అధ్యక్షుడు), గజేల్లి వెంకటయ్య (అధ్యక్షుడు), పూజారి నరసయ్య (ప్రధాన కార్యదర్శి), బూర్ల జ్ఞాని (ఉపాధ్యక్షుడు), పి. రామ్ రెడ్డి (కార్యదర్శి), అడిచర్ల రాజేశం, A. గంగయ్య, సిహెచ్ రామస్వామి, G. లక్ష్మణ్, పర్వతాలు యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. #InternationalWomensDay #Mancherial #WomenEmpowerment #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube