వైఎస్సార్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం
ప్రకాశం జిల్లా, సంతమాగులూరు:
సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో సెప్టెంబర్ 21న నిర్వహించనున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి వైఎస్సార్సీపీ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ సూచనల మేరకు అద్దంకి నియోజకవర్గ పార్టీ నాయకులు కేసరి చెన్నారెడ్డి, మారం రెడ్డి కొండారెడ్డి, చాగంటి రాజశేఖర్ రెడ్డి కనిగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ను స్థానిక పార్టీ కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా వెల్లలచెరువు గ్రామంలో నిర్వహించనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కార్యక్రమ ఏర్పాట్లు, పాల్గొనే వారి వివరాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.