www.ntodaynews.com
ఇసుక రీచ్లు సీజ్ చేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
ఇసుక రీచ్లు సీజ్ చేసిన అధికారులు
చిత్తూరు జిల్లా | గుడిపాల | NTODAY News
గుడిపాల మండలంలోని నారగల్లు పంచాయతీ సమీపంలోని మంచినీళ్ల గుంట, వెంగమాంబపురం సమీపంలో ఉన్న ఇసుక రీచ్లపై అధికారులు శనివారం చర్యలు చేపట్టారు.
గుడిపాల తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ రామ్మోహన్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత ఇసుక రీచ్లను సీజ్ చేశారు.
అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు లేదా తరలింపులు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.