www.ntodaynews.com
ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ ధరపై రూ.30 భారం తగ్గింది: కేంద్రం
జాతీయం
ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ ధరపై రూ.30 భారం తగ్గింది: కేంద్రం
పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలు చేయడంతో లీటరు పెట్రోల్ ధర రూ.125కు చేరకుండా ప్రస్తుతం రూ.94.77 వద్ద నిలిచిందని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. ఇథనాల్ మిశ్రమం వల్ల లీటరుకు సుమారు రూ.30 మేర వినియోగదారులకు ఆదా జరిగిందని పేర్కొంది.
ఇప్పటివరకు ఈ విధానం ద్వారా రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు, 950 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వెల్లడించింది. అలాగే ఇథనాల్ ఉత్పత్తి, సరఫరా ద్వారా రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు కేంద్రం వివరించింది.