www.ntodaynews.com
జాతీయ గీతం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించిన ప్రిన్సిపాల్
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం, జూలై 28 (తంబి కుమార్): ధర్మాజీగూడెంలోని అనన్య స్కూల్లో ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు జాతీయ గీతం 'జన గణ మన' ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన భారత జాతీయ గీతం ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిందని పేర్కొంటూ, జాతీయ గీతంలోని భావం, దేశభక్తి సందేశం, దాని గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి జాతీయ గీతాన్ని గౌరవంగా ఆలపిస్తూ దేశభక్తి భావాలను అలవరచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.