BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

జాతీయ రహదారిపై డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
11 Apr, 2026 - 06:32 PM
617 వీక్షణలు

జాతీయ రహదారిపై డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు : ఆరుగురి అరెస్ట్

​నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న హైవేలపై ఆగి ఉన్న లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్, చిట్యాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెగా ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్. ఉన్నాడు నిందితుల నుండి 40 లక్షల విలువైన సొత్తును, రెండు డీసీఎం వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీరిపై గతంలోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వేళ డ్రైవర్లు నిద్రపోతున్న సమయంలో ట్యాంకుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా డీజిల్ దొంగిలించడం వీరి స్టైల్ అని తెలిపారు. నిందితులని అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించామని తెలిపారు. ఈ దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.  అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ , డి.ఎస్.పి శివరాం రెడ్డి చిట్యాల పోలీసులు పాల్గొన్నారు..