www.ntodaynews.com
జాతీయ రహదారిపై లారీలో అగ్నిప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ సురక్షితం
ఆంధ్రప్రదేశ్
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కడియం నుంచి రాజస్థాన్కు మొక్కలు తరలిస్తుండగా షార్ట్సర్క్యూట్ కారణంగా లారీ క్యాబిన్లో మంటలు వ్యాపించి వాహనం దగ్ధమైంది.
మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై లారీ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టంపై దేవరపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.