www.ntodaynews.com
జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు
చిలకలూరిపేట: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వెళ్లే మార్గంలో గుంటూరు - ఒంగోలు జాతీయ రహదారిపై ఒక్కసారిగా ఒక బస్సు నిలిచిపోయింది. దీనివల్ల ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయి, సుమారు 50 వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. దాంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఒంగోలు - గుంటూరు వైపు ఉన్న రాంగ్ రూట్లలో నరసరావుపేట సెంటర్ వైపు ప్రయాణించారు.