BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

జీవో నెం. 396 రద్దు చేయాలని తిరువూరులో నిరవధిక నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 01:24 PM
34 వీక్షణలు

జీవో నెం. 396 రద్దు చేయాలని తిరువూరులో నిరవధిక నిరసన

తిరువూరు, జూలై 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దస్తావేజు లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు సోమవారం నుంచి నిరవధిక నిరసన చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరులు, లేఖరి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్ల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి జూలై 31 వరకు తిరువూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు ప్రజల దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించే జీవో నెం. 396 తమ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకుని తమ ఉపాధిని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం సబ్-రిజిస్ట్రార్ శ్యాముండేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. అలాగే తిరువూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ప్రజలందరూ తమ నిరసనకు మద్దతు ఇవ్వాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మనాభుని నాగేశ్వరరావు, వూటుకూరు రవికుమార్, కొండపల్లి మురళి, గౌర్రాజు ప్రభాకర్‌రావు, నరసింహారెడ్డి, మడుపు లవకుమార్, మడుపు యశ్వంత్‌కుమార్, జే.ఎస్. కుమార్, ముజిబుర్ రహ్మాన్, మోదుగు ప్రసన్నకుమార్, పానేం శ్రీనివాసరావు, చీపి రాంబాబు, రావూరి నాగమయ్య, మేరుగు నాగభూషణం, కే. దుర్గారావు, ఎన్. సౌజన్య, నల్లగట్ల సతీష్, షేక్ మౌలాలి, గోళ్ల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.