www.ntodaynews.com
జిల్లా కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఆగస్టు 27 : అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. మదనపల్లి డివిజన్ రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం పెద్ద సంఖ్యలో డీలర్లు కలెక్టరేట్కు చేరుకుని కార్యాలయ ఆవరణలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకుడు ఖాసీం మాట్లాడుతూ.. రేషన్ బియ్యం బస్తాలను స్కానింగ్ చేసి విక్రయించాలనే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, తమ సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీలర్ల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.