BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జై అమరావతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 09:14 PM
64 వీక్షణలు

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా ‘జై అమరావతి’ సంబరాలు 

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి న్యాయబద్ధ గుర్తింపు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వేడుకలు చేపట్టారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ స్లీవ జోజి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి, “జై అమరావతి” నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు.