www.ntodaynews.com
జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జై అమరావతి సంబరాలు
ఆంధ్రప్రదేశ్
జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా ‘జై అమరావతి’ సంబరాలు
జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి న్యాయబద్ధ గుర్తింపు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వేడుకలు చేపట్టారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ స్లీవ జోజి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి, “జై అమరావతి” నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు.