చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్
జన్నారం: చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్
జన్నారం, ఏప్రిల్ 15:
పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా జన్నారం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం జన్నారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వేసవి కాలంలో బాటసారులు, సామాన్య ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పద్మశాలి సంఘం వారు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు