BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 08:30 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 08:30 PM
110 వీక్షణలు

జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్   

పుంగనూరు, 

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడం లేదా ఆయన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం ఎవరి వల్లా కాదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్ విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలకు అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాష్ట్ర నాయకుడు మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా యువత, ప్రజల్లో విశేష ఆదరణ పొందిన నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడి సభలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, దేశంలో తిరగడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కొందరు రాజకీయ నాయకులు భయపడుతున్నారని, అందుకే జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కూడా జనసేనకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కొందరు నాయకులు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని, ప్రజల మద్దతుతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయని చైతన్య రాయల్ హెచ్చరించారు.