www.ntodaynews.com
జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. CCTVలో పెంపుడు కుక్క కీలక దృశ్యాలు
ఆంధ్రప్రదేశ్
/
కాకినాడ
తూర్పు గోదావరి జిల్లా, తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు.
తాజాగా ఈ కేసులో పెంపుడు కుక్కకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం 11:50 గంటల తర్వాత కుక్క కూడా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం 1:02 గంటలకు ఆలయం వద్ద ఆ కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆ కుక్క ఎక్కడికి వెళ్లిందనే విషయం స్పష్టత రాలేదు.
కుక్క పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.