www.ntodaynews.com
జూబ్లీ నగర్ వద్ద ఘోర ప్రమాదం.. యువకుడు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతుడు మర్లపాలెం గ్రామానికి చెందిన పర్వతనేని కృష్ణయ్య కుమారుడిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టగా, అప్పటికే యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం ఎస్ఐ కె. వెంకన్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.