www.ntodaynews.com
జ్యోతికి పీహెచ్డీ డాక్టరేట్.. అభినందనలు తెలిపిన ద్రావిడ విశ్వవిద్యాలయ అధ్యాపకులు
ఆంధ్రప్రదేశ్
తమిళ భాష మరియు అనువాద అధ్యయనాల విభాగాధిపతి డా. పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో ఈ పరిశోధన పూర్తయినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. నాగేశ్వరరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
డాక్టరేట్ పొందిన ఈ.ఎన్. జ్యోతి ప్రస్తుతం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమిళ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది ఈ.ఎన్. జ్యోతికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.