మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు..
Ntoday news : కాకినాడ జిల్లా తుని మండలం జనసేన అధ్యక్షుడు, పిఎసిఎస్ మెంబర్, మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.. ఈ మేరకు వెంకటరమణ మృతిదేహాన్ని కాకినాడ నుంచి బంధువులు తమ స్వగ్రామం కొలిమేరుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు.. ఇటీవల కాలంలో మధుమేహం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకటరమణ వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా అక్కడ వైద్యుల సూచన మేరకు వెంకటరమణ పాదాన్ని తొలగించారు.. అప్పటికే కిడ్నీ వైఫల్యం ఉండడంతో తీవ్ర ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో మొదటిగా తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు సూచన మేరకు ఇటీవల కాకినాడ జిజిహెచ్ కు తరలించారు.. అయితే వెంకటరమణ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండడంతో అప్పటినుంచి వెంటిలేటర్ మీదే ఉంచి చికిత్స అందిస్తున్నారు.. ఆదివారం సాయంత్రం పూర్తిస్థాయిలో ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.